నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం సంచలనం సృష్టించింది. ఇప్పుడు సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఏప్రిల్ 10, 2026 నుండి ప్రభాస్ షూటింగ్లో పాల్గొననున్నారు. సీక్వెల్కు 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో కమల్ హాసన్తో పాటు మరో బాలీవుడ్ నటుడు ప్రతినాయకుడిగా కనిపించనున్నారని, ప్రభాస్ పాత్రకు గట్టి సవాల్ విసరనున్నారని సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.