ఒమన్ తీరంలో భారతీయ నావికులతో వెళ్తున్న మరో చమురు నౌకపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలపై భారత్ స్పందించింది. నౌక కెప్టెన్తో మాట్లాడామని, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తొలుత వచ్చిన వార్తలు అవాస్తవమని భారత్ స్పష్టం చేసింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.