అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం బోస్టన్లో ప్రయాణికుల విమానానికి ప్రమాదం తప్పింది. చికాగో నుంచి వచ్చిన జెట్బ్లూ విమానం రన్వేపై నుంచి దారి తప్పింది. అదృష్టవశాత్తూ గడ్డిలో ఆగిపోయింది. ఈ సంఘటన కారణంగా ఎయిర్పోర్ట్లో అన్ని ఇన్కమింగ్, అవుట్గోయింగ్ విమానాలు నిలిచిపోయాయి. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా అహ్మదాబాద్లో గురువారం విమాన ప్రమాదంలో 241 మంది చనిపోయారు.