తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఐశ్వర్య రాజేశ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల 'ఓ సుకుమారి' చిత్రం ఫ్లాప్ అవ్వడంతో పాటు, ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ, శ్రీవిష్ణు కలయికలో దిల్ రాజు నిర్మించనున్న మల్టీస్టారర్ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో మొదట పూజా హెగ్డేతో పాటు ఐశ్వర్య రాజేశ్ను హీరోయిన్గా పరిశీలించినా, ఇప్పుడు ఆమె స్థానంలో డింపుల్ హయాతి పేరు తెరపైకి వచ్చింది.