AP: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారం దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల స్వామివారి సేవలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఒకరోజు అన్నవితరణ ఖర్చు రూ.44 లక్షలను విరాళంగా సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.