అమెరికాలోని ఓ జలపాతంలో ఏపీలోని జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన యువ ఇంజనీర్ శనగన హరి కిరణ్ గౌడ్ (25) గల్లంతయ్యారు. ఇటీవల ఎంఎస్ పూర్తి చేసిన కిరణ్ అమెరికాలోనే ఉద్యోగంలో చేరినట్టు తల్లిదండ్రులు తెలిపారు. స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లిన హరికిరణ్ జలపాతంలో గల్లంతైనట్టు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.