ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-4 మ్యాచ్లు ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్నాయని ఏసీఏ సెక్రటరీ సతీశ్ తెలిపారు. మొత్తం 25 మ్యాచ్లు ఉంటాయని, ఇవన్నీ విశాఖ వేదికగానే జరుగుతాయని వెల్లడించారు. జులై 14న ప్లేయర్స్ వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే సీజన్లో మరిన్ని స్టేడియాల్లో మ్యాచ్ల నిర్వహణకు కృషి చేస్తామని సతీశ్ వివరించారు. కాగా గతేడాది ఏపీఎల్ విజేతగా వైజాగ్ వారియర్స్ నిలిచింది.