మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ టెలికామ్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు గౌతమ్ దోషి, సతీష్ సేథ్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. రూ.100 కోట్లకు పైగా బ్యాంక్ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. సతీష్ సేథ్కు 2 రోజుల ఈడీ కస్టడీని ముంబై కోర్టు మంజూరు చేసింది. ఈ అరెస్టులు కార్పొరేట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.