AP: నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 8 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో తన తండ్రి వద్ద అటెండర్గా బాలిక ఉంటోంది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో కామాంధుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రి సిబ్బంది, రోగుల అటెండర్లు వృద్ధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై డీఎస్పీ గీతాకుమారి విచారణ చేపట్టారు.