ఇరాన్లోని టెహ్రాన్పై ఇజ్రాయెల్-అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ బాంబు దాడిలో గాంధీ ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణ భయంతో రోగులు పరుగులు తీశారు. ఇంక్యుబేటర్లలోని చిన్నారులతో నర్సులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్ట్రెచర్లపై ఆక్సిజన్ సిలిండర్లతో నిస్సహాయ స్థితిలో రోగులు ఉన్నారు. ఈ హృదయ విదారక దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.