TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేయండంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. గాయాలు అయిన వారిలో ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.