ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మల్లన్న కార్యాలయంపై దాడిని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. ‘మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం. బీసీ బిల్లు, రిజర్వేషన్లు అన్నీ కాంగ్రెస్ కృషి ఫలితమే. అ అంశంలో లబ్ధి పొందాలని ఇతరులు చూడటం సమంజసం కాదు’ అని అన్నారు.