శబరిమలలో తెలుగు భక్తుడిపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని అడిగినందుకు షాపు వ్యాపారి గాజు బాటిల్తో భక్తుడి తలపై కొట్టాడు. దీంతో తెలుగు రాష్ట్రాల భక్తులు షాపు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు కూడా అక్కడి వ్యాపారులకే సపోర్ట్ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గాయపడిన భక్తుడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.