హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు: కిషన్ రెడ్డి (వీడియో)

HYDలో కొంతకాలంగా వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఒక చోట దొంగతనానికి వచ్చిన వారు చేశారని, మరో చోట మానసిక పరిస్థితి బాగాలేని వారు చేశారని పోలీసులు చెప్పడం మసిపూసి మారేడు కాయ చేయడమే అని మండిపడ్డారు. ముత్యాలమ్మ ఆలయంలో ఖచ్చితంగా మతోన్మాద శక్తుల పనేనని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్