మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 29 పరుగులకు ఔట్ అయ్యారు. 22వ ఓవర్లో టీమిండియా బౌలర్ జడేజా వేసిన మూడో బంతికి LBW గా పెవిలియన్ చేరారు. దీంతో 23 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 113/3 గా ఉంది. కాగా, ఆసీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చారు.

సంబంధిత పోస్ట్