దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయంలో విరాళాల కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ దర్యాప్తులో నిందితులు దొంగిలించిన సొత్తును గుడి బయటకు తీసుకెళ్లే ముందు వాష్రూమ్ల్లో దాచిపెట్టినట్లు తెలిసింది. అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా ఈ మేరకు ఒప్పుకున్నాడు. నిందితులకు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల స్థానాలపై అవగాహన ఉండటంతో ఎవరికి కనిపించకుండా డబ్బు దొంగిలించేవారని శుక్లా వివరించాడు.