ఓ రోడ్డుపై ఏనుగుల గుంపు నడుస్తుండగా, ఒక చిన్న ఏనుగు కీరదోస అమ్మే బండి దగ్గరకు వచ్చి కీరాను తినసాగింది. దాన్ని చూసిన షాపుదారుడు భయంతో పక్కకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ కీరా కొంటున్న ఓ మహిళ ఆ ఏనుగుకు కీరా ఇచ్చింది. దీంతో ఏనుగుకు సహాయం చేసిందని నెటిజన్లు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ హృదయాన్ని తాకే సంఘటన భారతదేశంలో జరుగగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.