71వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం జ్యూరీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ‘బేబీ’ మూవీకి రెండు నేషనల్ అవార్డులు దక్కాయి. దీనిపై మూవీ డైరెక్టర్ సాయి రాజేశ్ స్పందించారు. ‘బేబీ సినిమాకు రెండు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఇది నాక కేరీర్కు గేమ్ ఛేంజర్ లాంటి సినిమా’ అని అన్నారు. కాగా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేశ్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్గా రోహిత్కు అవార్డులు వచ్చాయి.