TG: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తో పాటు మరో 9మందికి బెయిల్ మంజూరైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రిశాంక్పై రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదయ్యాయి. తన భార్యపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఫిర్యాదు చేసినందుకు క్రిశాంక్పైనే కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 24న అరెస్ట్ అయిన క్రిశాంక్కు 14 రోజుల రిమాండ్ విధించి, సంగారెడ్డి జైలుకు తరలించారు.