పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ బుధవారం జరుగుతోంది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 61.11 శాతం పోలింగ్ నమోదైంది. హావ్డా ఉత్తర్లో 63.16 శాతం, బారక్పుర్లో 61 శాతం, డైమండ్ హార్బర్, భవానీపుర్, సందేశ్ఖాలీ, దమ్దమ్లలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.