పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. గవర్నర్ సీవి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. గురువారం సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల సంఘటనల కారణంగా రాజ్భవన్ వెళ్లేందుకు భయపడుతున్నామని మహిళలు ఆమెకు చెప్పారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టుని ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.