ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్రాజ్లకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇద్దరూ త్వరలోనే సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కాగా, యాప్ ప్రచారంలో ప్రముఖులు ప్రమోషన్ చేసిన అంశంపై సీఐడీ వివరాలు సేకరిస్తోంది.