సినీ నటులు మోహన్ బాబు, విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో మంచు మోహన్ బాబు, విష్ణుపై నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేసిన నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీన్ని కొట్టేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించడంతో మంచు మోహన్ బాబు, విష్ణు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.