పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన సైనిక ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంతో పాక్కు సౌదీ నుంచి భరోసా లభించినా, ఇటీవల అఫ్గానిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగి, పాకిస్తాన్పై అఫ్గానిస్తాన్ దాడి చేసినప్పుడు, సైనిక ఒప్పందాన్ని గుర్తుచేస్తూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసినా, సౌదీ అరేబియా నుంచి ఆశించిన సహాయం లభించలేదని తెలుస్తోంది. దీంతో సౌదీ అరేబియా 'హ్యాండ్ ఇచ్చినట్లు' భావిస్తున్నారు.