దుబాయ్‌లో బిగ్‌ టికెట్‌ ఈ-డ్రా.. భారతీయుడికి పావుకేజీ బంగారం

దుబాయ్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన నితిన్‌ కున్నత్‌ రాజ్‌ అనే ప్రవాస భారతీయుడు బిగ్‌ టికెట్‌ ఈ డ్రాలో పావుకేజీ (250 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నారు. 10 మంది స్నేహితులతో కలిసి కొన్న టికెట్‌కు ఈ అదృష్టం వరించింది. మన దేశంలో దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని స్నేహితులతో పంచుకుంటానని, ఇలా అదృష్టం వరించడం ఇదే తొలిసారని కున్నత్‌ సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్