జగన్ నివాసం వద్ద కూల్చివేతలో బిగ్ ట్విస్ట్..!

మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి బయట కూల్చివేతలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే తెలంగాణలో ఒక మంత్రి కీలకమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ కూల్చివేతలు జరిగాయని చెబుతున్నారు. గతంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రి చెప్పడం వల్లనే ఈ కూల్చివేతలను చేపట్టారని తెలిసింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఈ మంత్రి జోనల్ కమిషనర్ హేమంత్‌కు నేరుగా ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఈ పనికి పూనుకున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్