బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ సర్వేల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, ఎన్డీయే కనీసం 130 స్థానాలు, గరిష్ఠంగా 167 స్థానాలు సాధించే అవకాశం ఉందని మ్యాట్రిక్స్ సర్వే పేర్కొంది. మరోవైపు మహాగఠ్బంధన్ 70 నుంచి గరిష్ఠంగా 108 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటెజీస్ అంచనా వేసింది. ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీకి 5 స్థానాలకు మించి అవకాశాలు కనిపించడం లేదని సర్వేలు సూచిస్తున్నాయి.