బిహార్ ఎన్నికల్లో మహాగఠ్బంధన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తన నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. పదో రౌండ్ ముగిసే సరికి తేజస్వీ 3,230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో BJP అభ్యర్థి సతీశ్ కుమార్ ఆధిక్యం కొనసాగించి ముందంజలో ఉన్నారు.