బీజేపీ తన 9 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను బీహార్ నుంచి నామినేట్ చేయనుంది. బీహార్లో నితిన్ నబీన్తో పాటు శివేశ్ కుమార్ రామ్ కూడా పోటీ చేయనున్నారు. అస్సాం నుంచి జోగెన్ మోహన్, తేరాష్ గోవాలా, హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, ఒడిశా నుంచి మన్మోమన్ సమల్, సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు మార్చి 16న జరగనున్నాయి.