సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో విషాదం చోటు చేసుకుంది. మొరాదాబాద్కు చెందిన బీజేపీ లోక్సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ ( 71) ఇవాళ కన్నుమూశారు. కున్వర్ సర్వేష్ సింగ్కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం లోక్సభ ఎన్నికల తొలి విడతలో మొరాదాబాద్ స్థానానికి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.