AP: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విష్ణు ఇంజినీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడి నుంచి ఈమెయిల్ రావడంతో కాలేజీలో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.