నవీ ముంబైలో 2020లో నమోదైన పోక్సో కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల బాలిక యూపీకి చెందిన 22 ఏళ్ల యువకుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. 10 నెలల తరువాత గర్భంతో తిరిగి వచ్చింది. యువకుడిపై బాలిక తండ్రి పోక్సో కేసు పెట్టారు. కేసు విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, 'బాలిక ఇష్ట ప్రకారమే వెళ్ళింది, ఆమెకు ఏం జరుగుతుందో తెలుసు' అని పేర్కొని, యువకుడికి బెయిల్ మంజూరు చేశారు.