TG: హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి డివిజన్ శాస్త్రిపురంలో ఆదివారం సాయంత్రం ఘోరం జరిగింది. అబ్దుల్లా రెహన్ (7) అనే బాలుడు తన అన్న, స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు హుడా పార్కుకు వెళ్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.