జల్పైగురి - రామ్నగర రూట్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలు నుంచి ఓ బాలుడు లగేజ్తో పాటు కిందపడిపోయాడు. బాలుడు కిందపడినట్లు గమనించిన ఓ మహిళ కేకలు వేయగా, ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగినా రైలు ఆగలేదు. తరువాత టీటీఈని సంప్రదించినప్పటికీ ఆయన స్పందించలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సహాయం అందకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు.