పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బెంగాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 11 మంది వరకు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. హరిశ్చంద్రపూర్కి చెందిన దంపతులు కూడా ఉన్నారు. ఎంసీసీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందించనుంది.