ముంబయి తీరంలో బుధవారం పడవ ప్రమాదం చోటుచేసుకుంది. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులతో వెళ్తోన్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని, 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారికోసం గాలింపు కొనసాగుతోందని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.