భారత అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురికి ఈ అవార్డును ప్రకటించింది. మను బాకర్ (షూటింగ్), హర్మన్ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెట్), డి గుకేశ్ (చెస్)కు అవార్డులు వరించాయి. 17 మంది పారాఅథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు వచ్చాయి.