హైదరాబాద్లోని మారియట్ హోటల్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026 ప్రారంభమైంది. జూలై 14 నుంచి 16 వరకు జరిగే ఈ సదస్సుకు 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఏఐ, ఆటోమేషన్ వంటి సాంకేతిక మార్పుల నేపథ్యంలో కార్మిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, కార్మిక హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.