ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మనసును హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి రోజున బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన పూజా యాదవ్ను.. వరుడు సన్నీ యాదవ్ ఆసుపత్రి ఐసీయూలోనే వివాహం చేసుకున్నాడు. వైద్యుల ప్రత్యేక అనుమతితో, వైద్య పరికరాల మధ్యే పూజ మెడలో సన్నీ తాళికట్టి తన ప్రేమను నిరూపించుకున్నాడు. వధువు పరిస్థితి విషమంగా ఉన్నా, సన్నీ వెనకడుగు వేయకుండా ఆమెనే పెళ్లాడతానని నిశ్చయించుకున్నాడు.