AP: ఎన్టీఆర్ జిల్లా, కోనాయపాలెంలో నాగలక్ష్మి అనే మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. గత నెల 24న నాగలక్ష్మి అదృశ్యమైనట్లు చందర్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా, నాగలక్ష్మిని ఆమె బావ గోవిందయ్య, అతని భార్య కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.