కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం అన్న వెంకటేష్ను తన తమ్ముడు నరేష్ హత్యచేశాడు. అన్న పేరుపై రూ. 4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న నరేష్.. అతన్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు నరేష్, స్నేహితుడు రాకేష్, డ్రైవర్ ప్రదీప్తో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో ఈ నిజాలు బయటపడటంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.