TG: కరీంనగర్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన ఘర్షణను హాస్యాస్పదమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కొట్టిపారేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పైకి కొట్టుకున్నట్లు కనిపించినా, ఈ రెండు పార్టీలు నిత్యం కలిసే ఉంటాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, దాడుల సంస్కృతి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.