ఏపీలోని పల్నాడు జిల్లాలో పార్టీల పోరు తారాస్థాయికి చేరుతోంది. తాజాగా వినుకొండలో దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్పై జిలానీ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి చంపేశాడు. రషీద్ రెండు చేతులు నరికి, మెడపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు జిలానీని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిలానీ టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది.