యూపీలోని కాస్గంజ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళపై ఎనిమిది యువకులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహిత తన భర్తతో కలిసి సరదాగా గడుపుదామని నడ్రాయ్ అక్విటెక్ట్ అనే పిక్నిక్ స్పాట్కు వెళ్లారు. ఈ క్రమంలో ఎనిమిది మంది యువకులు భర్తను కొట్టి ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆపై వీడియో కూడా తీశారు. పోలీసులు నిందితులలో ఐదుగురిని అరెస్ట్ చేయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.