2026 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 'నైబర్హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగా పొరుగు దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి రూ. 5,686 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే 4 శాతం నిధులు పెరిగాయి. భూటాన్కు అత్యధికంగా రూ. 2,289 కోట్లు, నేపాల్కు రూ. 800 కోట్లు, శ్రీలంకకు రూ. 400 కోట్లు, మారిషస్కు రూ. 550 కోట్లు, మాల్దీవులకు రూ. 550 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కు రూ. 150 కోట్లు, మయన్మార్కు రూ. 300 కోట్లు కేటాయించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరేసియా దేశాలకు కూడా నిధులు కేటాయించారు.