TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల పురోగతి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనపై కమిటీ విస్తృతంగా చర్చించింది.