సీబీఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) పద్ధతిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమని, ఈ వైఫల్యాలకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. 'వాటిని సరిచేస్తాం. పరిష్కారాలను కనుగొంటాం' అని ఆయన తెలిపారు.