ఢిల్లీలోని తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా.. 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.