మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన 103 ఏళ్ల డోలి నరసమ్మ సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆమె నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. సమాచారం అందుకున్న ఎల్.వి. ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆమె నేత్రాలను సేకరించారు. ఈ సంఘటన సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.