పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు ఊరట లభించనుంది. దేశీయ విమానాల ల్యాండింగ్, పార్కింగ్ రుసుములు 25 శాతం తగ్గించాలని విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆదేశించింది. 3 నెలల పాటు ఈ తగ్గింపు అమలులో ఉంటుందని పేర్కొంది.